Friday 3 April 2020

Editorial

సంపాదకీయం

కరోనా సంక్షోభం పై నా అభిప్రాయం..

దస్తావేజు లేఖరులమైన మనం లాక్ డౌన్  సందర్భంగా 22 మార్చ్ 2020 నుండి ఇంటికే పరిమితమై నేటికి పది రోజుల గడిచాయిఇంకా కూడా మనం 14 ఏప్రిల్ 2020 వరకు ఇదే పరిస్థితి కొనసాగించాలి. ఈ సందర్భంగా మనం మన భాధ్యతల ప్రాధాన్యత సరైన రీతిలో నిర్ధారించడానికి నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నా.

ఈ లాక్ డౌన్ కాలంలో మన ఇళ్లల్లో మనం బ్రతకడానికి సరిపడా సరుకు సమకూర్చుకున్నాం ఇంకా కావాలనుకుంటే సమకూర్చుకునే స్తోమత మనకు ఉందేమో కానీ నేటి విషమ పరిస్థితుల్లో మన వద్ద పని చేసే చిరు ఉద్యోగులు ఇంటివద్దే ఉన్న వారికి మరియు మనలో ఉన్న బీద కుటుంబాలకు ఎంత మేరకు మనం ఆదుకున్నామో ఆత్మవిమర్శ చేసుకొని మన ఔదార్యం చాటుదాం.

ఇకపోతే ఉన్నంతలో ఏమి వొచ్చిన రాకున్నా మన దస్తావేజు లేఖరుల కార్యాలయాలకు నెలసరి రెంట్లుఉద్యోగులకు నెలసరి జీతాలుతప్పనిసరిగా చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించుకోవాలి అది విస్మరించి ఏదైనా సామాజిక భాధ్యత వైపు దృష్టిసారించె ముందు మనం ఎవ్వరికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక్కసారి ఆలోచనతో వ్యవహరించండి.

ఈ మహమ్మారి వల్ల ఉన్నపలాన అన్ని రంగాలలో అభివృద్ధి కుంటుపడిందికాగా ఈ కుదేలయిన ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడ్డ సంక్షోభం నుండి ఇప్పట్లో మనం కోలుకోవడం ఒక కష్టమైన పనేకాబట్టి కలసి కట్టుగా ఉండి ముందు మనపై ఆధారపడి ఉన్నవారికి చేతనైనంత వరకు అండగా ఉండేందుకు ప్రయత్నిద్దాం ఆ తరువాతే ఏదైనా.

నా ఈ అభిప్రాయం కేవలం మనలో ఉన్న సంపన్నులను ఉదేశించి ఏ మాత్రం కాదుఈ విపత్కర పరిస్థితుల్లో మన పై ఆధార పడి బ్రతుకుతున్న బీద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తపరిచాను.

దయచేసి నా అభిప్రాయంలో ఉన్న మంచి గ్రహించగలరు.....

ఇట్లు

మీ
సంగం బాలాజీ   
B. Com., M. B. A., LL. B.
Blog Editor -  dwaaram 
email: dwaaram@gmail.com

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete